Telugu Updates

భోజన శాలలు తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ..

Post top

భోజన శాలలు తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ..                                      ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – సబ్ జింధం నరహరి) నవంబర్25: ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం రోజు ఆర్మూర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ రమేష్ పంపిస్తున్న ఏరియా ఆసుపత్రి లోని భోజనశాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంట పాత్రలను శుభ్రంగా ఉంచాలని వంట చేసే వ్యక్తులు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని, వంట చేయాలని వారికి సూచించారు. కుళ్లిన కూరగాయలు కానీ నాణ్యతలేని ఆహార పదార్థాలను వంటలో వాడకూడదని హెచ్చరించారు. వంటగదిని, వంటగది పరిసరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ కృష్ణమూర్తి ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.