Telugu Updates

జాప్యానికి తావులేకుండా సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి. -ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్.

Post top

జాప్యానికి తావులేకుండా సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి. ◆ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్.                                                                    ◆ కేసుల దర్యాప్తు పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్ష.   నిజామాబాద్(తెలంగాణ ఫోకస్) ఫిబ్రవరి 16: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువు లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్ గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులకు సూచించారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్షపడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.