Telugu Updates

నమ్మించాడు.. రూ.10 కోట్లతో ఉడాయించడు..

Post top

ఆర్మూర్(TELANGANA FOCUS)జూన్30: ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను నమ్మిస్తూ బట్టల వ్యాపారం చేసుకుంటున్న ఓ రాజస్థాన్ వ్యాపారస్తుడు రూ.10 కోట్లతో పరార్ అయినట్లు తెలిసింది.
– వివరాలు వెళ్తే ఇలా ఉన్నాయి.. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఆర్.కే కాంప్లెక్స్ దుకాణ సముదాయంలో ఆర్మూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకునికి చెందిన షట్టర్ల ను ఆ రాజస్థాన్ వ్యాపారి అద్దెకు తీసుకొని వ్యాపారం నిర్వహించుకునేవాడు.గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్ ప్రాంతంలో ఉంటూ ప్రముఖుల, పేరు గల ఫైనాన్షియర్ల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నమ్మకంగా తిరిగి చెల్లించేవాడు.
క్రమంగా రాజస్థాన్ వ్యాపారి స్థానికంగా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆర్మూర్లో తొలుత ఫైనాన్స్ వ్యాపారులకు నమ్మకం కలిగించి వారి నుంచి డబ్బులు తీసుకొని ఎప్పటికప్పుడు వారి డబ్బులను తిరిగి చెల్లించేవాడు. అదే అదునుగా భావించి ఆ వ్యాపారి ఆర్మూర్లోని ఫైనాన్స్ రాజస్థాన్ వ్యాపారి వ్యాపారుల నుంచి, ప్రముఖుల నుంచి ఒకరికి తెలియకుండా ఇంకొకరి వద్ద నుండి సుమారు రూ.10 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడని స్థానికుల సమాచారం. అయితే తాజాగా ఇంటితో పాటు, ఆర్.కే కాంప్లెక్స్ లోని దుకాణానికి తాళాలు వేసి ఆర్మూర్ నుంచి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు ఇచ్చిన వారు ఆర్కే కాంప్లెక్స్లోని ఆ రాజస్థాన్ వ్యాపారి షట్టర్లకు తాళాలు వేసి ఉండటాన్ని గమనించారు.
కొన్ని రోజుల నుండి ఆ దుకాణం తెరవకపోవడంతో ఫైనాన్స్ వ్యాపారులకు అనుమానం వచ్చి సదరు వ్యాపారికి ఫోన్ చేశారు. అయితే వ్యాపారి ఫోను కొద్ది రోజులు లిఫ్ట్ చేసి ఆర్మూర్లోని కొందరు వ్యక్తులు తనను బెదిరించారని దాంతోనే ఆర్మూర్ ను విడిచి వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. తరువాత కొద్ది రోజులకు ఫైనాన్స్ వ్యక్తులు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని విశ్వసనీయ సమాచారం. మొత్తం 40 నుంచి 60 మంది వ్యక్తులు ఆ రాజస్థాన్ వ్యాపారికి ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు మొత్తం సుమారు రూ.10 కోట్ల వరకు అప్పులు ఇచ్చినట్లు తెలిసింది.
లక్షల్లో డబ్బులు ఆ రాజస్థాన్ వ్యాపారికి ఇచ్చిన వారు వ్యాపారి జాడ కోసం ఎంత వెతికినా సమాచారం అందకపోవడంతో ఏమిచేయాలో తెలియక బాధితులు తలలు లబోదిబోమంటున్నారు. రూ.10 కోట్ల డబ్బులు తీసుకుని ఓ రాజస్థాన్ వ్యాపారి పరార్ అయిన విషయం ఆర్మూర్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయమై ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు డబ్బులు ఇచ్చిన బాధితులు ముందుకు రావడం లేదు. ఇల్లీగల్ ఫైనాన్స్ ల వల్లే ఫిర్యాదు ఇచ్చేందుకు ఫైనాన్షియర్లు, ప్రముఖులు జంకుతున్నట్లు తెలిసింది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.